భారత్ కు వచ్చే ఆసీస్ జట్టు ఇదే..

భారత్ కు వచ్చే ఆసీస్ జట్టు ఇదే.. - Sakshi


సిడ్నీ:పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా వచ్చే నెల్లో భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును శుక్రవారం ప్రకటించారు. భారత పర్యటనలో ఆసీస్ ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20లు ఆడనుంది. దీనిలో భాగంగా వన్డే, ట్వంటీ 20 సిరీస్ లకు వేర్వేరుగా జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ఎంపిక చేసింది.  గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ మిచెల్ స్టార్క్ కు విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో జేమ్స్ ఫాల్కనర్, నాథన్ కౌల్ట‌ర్ నీల్‌లు మ‌రోసారి టీమ్‌లోకి వ‌చ్చారు.వన్డే, ట్వంటీ 20 జట్లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 11 వరకూ జరునుంది.  ఐదు వన్డేల సిరీస్ కు చెన్నై, బెంగళూరు, నాగ్ పూర్, ఇండోర్, కోల్ కతాలు ఆతిథ్యమిస్తుండగా, టీ 20 సిరీస్ కు హైదరాబాద్, రాంచీ, గౌహతిలు ఆతిథ్యమిస్తున్నాయి. ప్రస్తుతం విరాట్ సేన శ్రీలంక పర్యటలో ఉంది.



వన్డే జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోనిస్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, నాథన్ కౌల్టర్ నైల్, పాట్రిక్ కమిన్స్, జేమ్స్ ఫాల్కనర్, జోష్ హజల్ వుడ్, అస్టాన్ అగర్, కార్ట్ రైట్, అడమ్ జంపా



ట్వంటీ 20 జట్టు:స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), జాసన్ బెహ్రెన్డార్ఫ్,  డాన్ క్రిస్టియన్, నాథన్ కౌల్టర్ నైల్, పాట్రిక్ కమిన్స్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, హెన్రిక్యూస్, మ్యాక్స్ వెల్, టిమ్ పైనీ, కేన్ రిచర్డ్సన్, అడమ్ జంపా

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top