ఇంగ్లండ్‌దే టి20


రాణించిన మోర్గాన్, మొయిన్

కార్డిఫ్:
యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఏకైక టి20 మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. సోమవారం ఇక్కడ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. మోర్గాన్ (39 బంతుల్లో 74; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), మొయిన్ అలీ (46 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడో వికెట్‌కు 74 బంతుల్లోనే 135 పరుగులు జోడించడం విశేషం. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. స్మిత్ (53 బంతుల్లో 90; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 68 బంతుల్లో 112 పరుగులు జత చేయడంతో జట్టు విజయం దిశగా సాగింది. అయితే 10 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో స్మిత్ అవుట్ కావడం ఆసీస్‌ను దెబ్బ తీసింది. చివరి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి కంగారూలు ఓటమిపాలయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top