ఇంగ్లండ్ లక్ష్యం 279


పెర్త్: ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 279 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు ఎనిమిది వికెట్లకు 278 పరుగులు చేసింది.  ఓపెనర్లు విఫలమవగా తరువాత బ్యాటింగ్కు వచ్చిన స్మిత్ (40), మరో బ్యాట్స్ మెన్ మాక్స్వెల్ (95), మార్ష్ (60) రాణించారు. చివర్లో బ్యాటింగ్కు దిగిన ఆల్రౌండర్ ఫాల్క్నర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.



ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ మూడు, ఆండర్సన్ రెండు, ఫిన్, ఆలీ చెరో వికెట్ పడగొట్టారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top