భారత్ తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్
సౌతాంప్టన్: భారత్తో మూడో టెస్టులో రెండో రోజు సోమవారం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. 247/2 ఓవర్నైట్ స్కోరుతో కుక్ సేన బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ బాలెన్స్ (104), ఇయాన్ బెల్ (16) క్రీజులోకి వచ్చారు.
మ్యాచ్ తొలిరోజు నిలకడగా ఆడిన ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేసింది. భారత బౌలర్లు రోజంతా శ్రమించినా కేవలం రెండు వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటతో పోలిస్తే రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కాస్త దూకుడు పెంచారు.