569 పరుగుల వద్ద ఇంగ్లండ్ డిక్లేర్
సౌతాంప్టన్:భారత్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 247/2 పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ 569 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. టీ సమయానికి 452/5 పరుగులతో బ్యాటింగ్ తిరిగి ఆరంభించిన ఇంగ్లండ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ ఇన్నింగ్స్ లో బ్యాలెన్స్ (156) పరుగులతో మరోసారి ఆకట్టుకోగా, ఇయాన్ బెల్ దూకుడుగా ఆడి(167) పరుగులు చేశాడు.
అనంతరం చివరి వరుస ఆటగాడు బట్లర్ (85) పరుగులు చేసి ఇంగ్లండ్ భారీ పరుగులు చేయడంలో తోడ్పడ్డాడు. రెండో రోజు ఆటలో 73.4 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 569/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా, రవీంద్రా జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.