ఓటమి దిశగా ‘గ్రీన్’
గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ తొలి ‘పింక్ బాల్’ మ్యాచ్లో ఇండియా రెడ్ జట్టు విజయానికి చేరువైంది. 497 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా గ్రీన్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
ఓపెనర్ ఉతప్ప (72) అర్ధ సెంచరీ చేయగా, రైనా (42) ఫర్వాలేదనిపించాడు. రెడ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (5/55) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు 344/3 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన రెడ్ తమ రెండో ఇన్నింగ్స్లో 486 పరుగులకు ఆలౌటైంది.