బిన్నీ ఔట్.. అమిత్ మిశ్రా ఇన్!
రెండు ట్వంటీ20ల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్తో ఆదివారం రాత్రి జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ జట్టులో ఏకైక మార్పు చేసింది. తొలి టీ20లో ఒకే ఓవర్ వేసి ఏకంగా 5 సిక్సర్స్ సహా 32 పరుగులిచ్చిన బౌలర్ స్టూవర్ట్ బిన్నీకి ఈ మ్యాచ్ లో అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చాడు.
గాయం కారణంగా తొలి మ్యాచ్ కు అందుబాటులో లేని విండీస్ బీకర ఆటగాడు క్రిస్ గేల్ ఈ మ్యాచ్ లోనూ ఆడటం లేదు. టీమిండియా శనివారం రాత్రి జరిగిన ట్వంటీ20 మ్యాచ్ లో అద్భుతంగా పోరాడినా ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు