ధోని నాలుగులోనే కొనసాగాలి
భారత వన్డే క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా ధోని నాలుగో స్థానంలో ఆడటమే కరెక్టని, ప్రస్తుతం కొన్ని ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా అతను నాలుగులోనే కొనసాగాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.
‘ఫినిషర్ అంటే 40వ ఓవర్లో రావాలని రూలేం లేదు. కోహ్లి ఫస్ట్డౌన్లో వచ్చి కూడా మ్యాచ్లు ముగిస్తున్నాడు. నాలుగో స్థానంలో ధోని అనుభవం కూడా కోహ్లికి కలిస్తే... ఈ ఇద్దరే మ్యాచ్లు ముగిస్తారు’ అని గంగూలీ అన్నారు.