దేవేంద్రో సింగ్‌కు నిరాశ


దక్కని ‘రియో’ బెర్త్

భారత బాక్సర్లకు మూడు కాంస్యాలు

 


 

బాకు (అజర్‌బైజాన్):  రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో భారత బాక్సర్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు) విఫలమయ్యాడు. ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో దేవేంద్రో సెమీఫైనల్లోనే నిష్ర్కమించాడు. హెరెడియా శామ్యూల్ (స్పెయిన్)తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో దేవేంద్రో 1-2తో ఓడిపోయాడు. దాంతో  కాంస్యం లభించింది. మరోవైపు ఇప్పటికే రియో బెర్త్‌లు ఖాయం చేసుకున్న వికాస్ క్రిషన్ (75 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్లోనే వెనుదిరిగారు.



ఫలితంగా ఈ టోర్నీలో భారత్ మూడు కాంస్యాలతో సంతృప్తి పడింది. సెమీఫైనల్స్‌లో మనోజ్ 0-3తో మెక్‌కోర్మాక్ చేతిలో ఓడిపోయాడు. ఇక క్వార్టర్స్‌లో గాయపడిన వికాస్ తన నుదుటిపై కుట్లు వేయించుకోవడంతో సెమీస్‌కు అన్‌ఫిట్‌గా డాక్టర్లు తేల్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top