కుప్పకూలిన ఢిల్లీ టాప్ ఆర్డర్
ఢిల్లీ: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 39 పరుగులకే 4 వికెట్లు నష్టపోయింది. డుమిని 13, యువరాజ్ సింగ్ 2 పరుగులు చేసి అవుటయ్యారు. మాథ్యూస్, అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. యువరాజ్, మాథ్యూస్ లను వరుణ్ ఆరోన్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. స్టార్క్, వీసె చెరో వికెట్ తీశారు.
ఢిల్లీ 11 ఓవర్లలో 62/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. అగర్వాల్(25), జాదవ్(16) క్రీజ్ లో ఉన్నారు.