మెల్బోర్న్: రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్, స్కోరు: 293/5
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ రెండో రోజు ఆట ఆరంభమైంది. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 293 పరుగులతో కొనసాగుతోంది. మొదటి రోజు మ్యాచ్.. తొలి సెషన్లో కాస్త విఫలమైనా.. చివరి రెండు సెషన్లలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే కెప్టెన్ స్మిత్ ఒంటరిపోరాటంతో ఇన్నింగ్స్ను గాడిలో పెట్టడంతో ఆసీస్ కోలుకుంది.
మూడో టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 5 వికెట్లకు 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్మిత్(77)తో పాటు హాడిన్ (51 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.