క్రికెట్లో మరో విషాదం
బంతి తాకి ఇంగ్లండ్లో క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: క్రికెట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్లో బంతి తాకి శ్రీలంక తమిళ సంతతికి చెందిన బవ్లాన్ పద్మనా థన్ అనే బ్రిటిష్ యువకుడు ఆదివారం మరణించాడు. లాంగ్ డిట్టన్ రిక్రియేషన్ మైదానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బ్రిటిష్ తమిళ్ లీగ్లో 24 ఏళ్ల బవ్లాన్ మనీపే పారిష్ స్పోర్ట్స్ క్లబ్కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు.
డివిజన్ త్రీ మ్యాచ్ సందర్భంగా బౌలర్ వేసిన బంతి బవ్లాన్ చాతీని బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్రికెటర్ను ఏడు గంటల ప్రాంతంలో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు సీపీఆర్ చికిత్స అందిం చినా ప్రయోజనం లేకపోయింది. బవ్లాన్ మరణం తో తాము విషాదంలో మునిగిపోయామని మనీపే స్పోర్ట్స్ క్లబ్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది.