క్రికెట్‌ బుకీల అరెస్టు


యాకుత్‌పురా(హైదరాబాద్)‌: క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ ముఠాపై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరు బుకీలను శనివారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 7,01,500 నగదు, ఒక టీవీ, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎన్‌. కోటిరెడ్డి వెల్లడించిన వివరాలివీ..సికింద్రాబాద్‌ బేగంపేట్‌ పాటిగడ్డ కాలనీకి చెందిన నితీష్‌ సింగ్‌ ఠాకూర్‌ (23), ఉప్పల్‌ బాలాజీ హిల్స్‌ ప్రాంతానికి చెందిన హరి విశాల్‌ (28)లు క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడుతుంటారు.



ఇందులో భాగంగా నితీష్‌ సింగ్, హరి విశాల్‌లు షాహినాథ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌ కుమార్‌ (35), జాంబాగ్‌కు చెందిన మోహిత్‌ (32) కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి నితీష్‌ సింగ్‌ను అబిడ్స్‌లో, మనోజ్‌ కుమార్‌ షాహినాథ్‌గంజ్‌లో అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.7,01,500 నగదు, ఒక ఎల్‌ఈడీ టీవీ, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బేగంపేట్, షాహినాథ్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. 2015లో మనోజ్‌ కుమార్‌పై షాహినాథ్‌ గంజ్, హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధం కలిగి ఉన్న కేసులు నమోదై ఉన్నాయి. హరివిశాల్‌ సహయంతో ఫంటర్స్‌ వద్ద నితీష్‌ సింగ్‌ డబ్బులు కలెక్ట్‌ చేసేవాడు. ప్రస్తుతం మోహిత్, హరివిశాల్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top