కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హాకీ శుభారంభం


గ్లాస్కో: కామన్వెల్త్ గేమ్స్లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. పూల్-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-1తో లౌలీ వేల్స్పై అలవోకగా విజయం సాధించింది.



మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు ఒక్కో గోల్ మాత్రమే చేశాయి. దీంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు విజృంభించారు. రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్నందించారు. భారత జట్టులో రఘునాథ్, ఆర్ సింగ్, గుర్వీందర్ సింగ్ ఒక్కో గోల్ చేశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top