భారత కుర్రాళ్ల క్లీన్‌స్వీప్‌


టాంటన్‌: అన్ని విభాగాల్లో రాణించిన భారత అండర్‌–19 జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత కుర్రాళ్ల జట్టు ఒక్క వికెట్‌ తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది.



భారత బౌలర్లలో రాహుల్‌ చహల్‌ నాలుగు, అభిషేక్‌ శర్మ 3 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 49.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్‌ పృథ్వీ షా (45 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), హర్వీక్‌ దేశాయ్‌ (44; 4 ఫోర్లు, ఒక సిక్స్‌), కమలేశ్‌ నాగర్‌కోటి (26 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top