ట్రై సిరీస్: ఆసీస్ పై జింబాబ్వే ఘన విజయం


హరారే: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ముక్కోణపు పోటీలో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. 210 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే 48 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 31 ఏళ్ల తరువాత ఆసీస్ పై జింబాబ్వేకు రెండో విజయం దక్కింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిగుంబరా(52), టేలర్(32), ఉత్సేయా(30),సికందర్ రాజా(22)పరుగులు చేసి జట్టు గెలుపుకు సహకరించారు.


 


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 209 పరుగులు మాత్రమే చేసింది.ఆసీస్ కెప్టెన్ క్లార్క్(68),హడిన్(49), కట్టింగ్(26)పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్, తిరిపానో, ఉత్సేయాలకు తలో రెండు వికెట్లు తీసి ఆసీస్ ను తక్కువ పరుగులకు కట్టడి చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top