బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
అహ్మదాబాద్: ఐపీఎల్-8లో మరో ఆసక్తికర పోరు కాసేపట్లో జరగనుంది. ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు ఓటమెరుగని రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్లు కాసేపట్లో తలపడనున్నాయి. చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా, చెన్నై కూడా ఆడిన మూడింటిలోనూ గెలుపొందింది. గాయం కారణంగా దూరమైన రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ ఈ మ్యాచ్లో బరిలో దిగనున్నాడు.