ధాటిగా చెన్నై బ్యాటింగ్
హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ధాటిగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై ఐదు ఓవర్లు ముగిసే ఒక వికెట్ నస్థానికి 51 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో స్మిత్ (26)ను అనిరుధ్ సింగ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఓపెన్లు మెక్ కల్లం (24), రైనా (1) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కరణ్ వీర్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చెన్నై ఓపెనర్ స్మిత్.. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు, ఒక టుడితో 22 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అనిరుధ్ సింగ్ బౌలింగ్ లో మెక్ కుల్లంకు జీవన దానం లభించింది. లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ జాన్సన్ బ్రెండన్ ఇచ్చిన సునాయసమైన క్యాచ్ ను జారవిడిచాడు.