భారీ స్కోరు దిశగా చెన్నై


ఓపెనర్లు మెక్ కల్లం, స్మిత్ బలమైన పునాది వేయడంతో శనివారం కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై.. 138 పరుగులు చేసింది. సహజంగా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే కెప్టెన్ ధోనీ.. ఈ మ్యాచ్ లో సెకండ్ డౌన్ గా వచ్చాడు. ప్రస్తుతం రైనా (29), ధోని (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 44 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 66 పరుగులు చేసిన మెక్ కల్లం ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top