రూ.20కే హాకీ వరల్డ్ లీగ్ టిక్కెట్


మీరంతా హాకీ ఫ్యాన్స్ అయితే వెంటనే ఢిల్లీలోని ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంకు పరుగులు తీయండి. ఎందుకంటే మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఎఫ్ఐఎచ్ వరల్డ్ లీగ్ 2 (మహిళలు)కు అతి తక్కువ ధరకే హాకీ ఇండియా టిక్కెట్లు విక్రయిస్తోంది. ఎనిమిది టీములు ఇక్కడ పోటీలో పాల్గొంటున్నాయి.


గురువారం ఈ టిక్కెట్ల కొనుగోలు కోసం హాకీ ఇండియా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టిక్కెట్జీనిడాట్ ఇన్ అనే సైట్ను ప్రారంభించింది. ఇంతకీ ఈ టిక్కెట్ ధర ఎంత అనుకుంటున్నారు.. కేవలం రూ.20. వీఐపీ స్టాండ్లో రూ.100 ఉండనుంది. ఇక జేబులో రూ.20 ఎవరైనా హాకీ చూడొచ్చన్న మాట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top