చందర్‌పాల్ సెంచరీ


 గ్రోస్ ఐలెట్ (సెయింట్ లూసియా): సీనియర్ బ్యాట్స్‌మన్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (134 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను నాలుగు వికెట్లకు 269 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 40 ఏళ్ల చందర్‌పాల్‌కు ఇది 30వ సెంచరీ. బ్లాక్‌వుడ్ (120 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. అనంతరం 489 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నాలుగో రోజు డ్రింక్స్ విరామ సమయానికి 31 ఓవర్లలో 94/2 పరుగులతో ఆడుతోంది. రహమాన్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు; 2 సిక్స్) రాణించాడు.

 

 

 


 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top