చండీగఢ్‌లో భారత్, కొరియా డేవిస్ కప్ మ్యాచ్


న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే పోటీకి చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 15 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీకి చండీగఢ్ క్లబ్ గ్రాస్ కోర్టులు వేదికగా నిలువనుందని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) వెల్లడించింది. చివరిసారి 2012లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్‌కు చండీగఢ్ వేదికగా నిలిచింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top