మెక్ కల్లమ్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్- 8 లో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ అర్ధ సెంచరీ సాధించాడు. ఎదుర్కొన్న తొలిబంతి నుంచే దూకుడు కొనసాగించిన మెక్ కల్లమ్.. 32 బంతుల్లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 54 పరుగులు చేశాడు.
మరో ఎండ్ లో సురేశ్ రైనా (12) చక్కటి భాగస్వామ్యం అందిస్తున్నాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయిన చెన్నై స్కోరు 97 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డ్వెయిన్ స్మిత్(26)ను అనిరుధ్ సింగ్ ఔట్ చేశాడు.