భారత్ 71/1
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ ఈ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 23 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది. మురళి విజయ్ 27 పరుగులకు స్టార్క్ బౌలింగ్లో అవుటయ్యాడు. ధావన్ 26 పరుగులు, పూజారా 15 పరుగులతో నాట్ అవుట్గా ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 408 పరుగులకు, ఆస్ట్రేలియా 505 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది.