భారత జట్టుకు ఫిట్నెస్ పరీక్ష
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఫిట్నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. మామూలుగా గాయం నుంచి కోలుకున్న ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే తొలిసారిగా జట్టులోని ఆటగాళ్లందరినీ టెస్టుకు పిలువనున్నారు. జూన్ 5న క్రికెటర్లంతా కోల్కతాకు చేరుకుంటుండగా 6న ఫిట్నెస్ టెస్టు జరుగుతుంది. 7న జట్టు ఢాకాకు బయలుదేరుతుంది.
‘ఇటీవలి కాలంలో చాలా మంది ఆటగాళ్లు సిరీస్ మధ్యలోనే గాయాల సమస్యతో స్వదేశానికి రావడం జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకూడదనుకుంటున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆసీస్ పర్యటనలోనూ జడేజా, భువనేశ్వర్ ఇలాగే భారత్కు తిరిగి వచ్చారు. ఇషాంత్ శర్మ కూడా గాయపడ్డాడు. మరోవైపు ఏ ఆటగాడైనా అలసటగా ఉన్నట్టు భావిస్తే వెంటనే బోర్డు కార్యదర్శికి సమాచారమివ్వాలని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతీ స్లాట్నూ భర్తీ చేసే ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు.