ఫిక్సింగ్ చేస్తే పదేళ్ల జైలు!
బిల్లు ప్రతిపాదించిన అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: క్రీడల్లో అవినీతిని నిరోధించే ప్రయత్నానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ సభ్యుని హోదాలో శ్రీకారం చుట్టారు. లోక్సభలో ఆయన మూడు ప్రైవేట్ బిల్లులను ప్రవేశ పెట్టారు. ఇందులో ‘నేషనల్ స్పోర్ట్స్ ఎథిక్స్ కమిషన్’ బిల్లు ఉంది. దీని ప్రకారం ఏ క్రీడలోనైనా ఆటగాడు ఫిక్సింగ్కు పాల్పడితే కనీసం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. డోపింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, తప్పుడు వయసు ధ్రువీకరణ, లైంగిక వేధింపులు తదితర వాటిని అడ్డుకునే నియమావళితో కూడిన ఈ బిల్లును ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టారు. మ్యాచ్ ఫిక్సింగ్ తదితర కేసులకు సంబంధించి తగిన చట్టాలు లేక చాలా వరకు చీటింగ్వంటి సంబంధం లేని కేసులు పెట్టడం వల్ల శిక్షలు పెద్దగా ఉండడం లేదు. ‘
అసలైన క్రీడాభిమానుల్లో నమ్మకం పెంచేందుకు ఆటలో జవాబుదారీతనం ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే దాని కోసం ఎలాంటి చట్టాలూ లేవు. దీనిని ఆపాలంటే కచ్చితంగా కఠిన చట్టాల అవసరం ఉంది’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.