మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్

మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్


ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్

 సిడ్నీ: వరుసగా రెండు అలవోక విజయాలతో హైదరాబాద్ ప్లేయర్ ఆర్‌ఎంవీ గురుసాయిదత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల తొలి రౌండ్‌లో గురుసాయిదత్ 21-13, 21-9తో అయ్ వీ జియాన్ (మలేసియా)పై నెగ్గి... రెండో రౌండ్‌లో 21-15, 21-8తో కజుమాసా సకాయ్ (జపాన్)ను ఓడించాడు.

 

 మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అశ్విని పొన్నప్ప (భారత్) జంట కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. తొలి రౌండ్‌లో ప్రణవ్-అశ్విని 21-19, 21-17తో మార్క్ లామ్స్‌ఫస్-ఇసాబెల్ హెర్‌ట్రిచ్ (జర్మనీ)పై, రెండో రౌండ్‌లో 21-4, 21-6తో చామ్ చెన్-సుసాన్ వాంగ్ (ఆస్ట్రేలియా)లపై విజయం సాధించారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో కశ్యప్; విటింగస్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో గురుసాయిదత్; లిడియా యి యు (మలేసియా)తో సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు తలపడతారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top