కోహ్లిసేనను స్వీపర్లతో పోల్చిన ఆస్ట్రేలియా జర్నలిస్టు

కోహ్లిసేనను స్వీపర్లతో పోల్చిన ఆస్ట్రేలియా జర్నలిస్టు

సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ముందే మైండ్‌ గేమ్‌ మొదలైంది. సూటిపోటీ మాటలు, స్లెడ్జింగ్‌తో ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆసీస్‌ మీడియా, ప్లేయర్లకు అలవాటే. తాజాగా ఓ ఆసీస్‌ జర్నలిస్టు కోహ్లి సేనను స్వీపర్లతో పోలుస్తూ తన నోటి దురుసును ప్రదర్శించాడు.  గతేడాది స్వచ్ఛ భారత్‌ పథకం ప్రమోషన్‌లో భాగంగా కోహ్లి సేన ఈడెన్‌ గార్డెన్‌ను చీపుర్లతో ఊడ్చిన విషయం తెలిసిందే.

 

వరల్డ్‌ ఎలెవన్‌, పాక్‌ టీ20 మ్యాచ్‌కు ముందు ఆ జర్నలిస్టు ఈ ఫోటోకు క్యాప్షన్‌గా మ్యాచ్‌ గ్రౌండ్‌ను సిద్దం చేస్తున్న స్వీపర్లు అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో భారత అభిమానులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఎదురు దాడి చేశారు. ‘అవును పాక్‌లోని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను ఊడ్చేస్తున్నారు’ అని , ఆస్ట్రేలియా ప్లేయర్ల కన్నా కోహ్లి గొప్ప స్వీపర్‌ అని, మీరు మాత్రం బంగ్లా బౌలర్లతో స్వీప్‌ అవుతారని తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top