ఆసీస్‌కు ఆధిక్యం


పల్లెకెలె (శ్రీలంక): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. బుధవారం రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 86 పరుగుల ఆధిక్యం లభించింది. వోజెస్ (115 బంతుల్లో 47; 3 ఫోర్లు) రాణించగా... మార్ష్ 31, స్మిత్ 30, ఖాజా 26 పరుగులు చేశారు.



66/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ను, శ్రీలంక బౌలర్లు హెరాత్ (4/49), లఖన్ సందకన్ (4/58) భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట నిలిచే సమయానికి 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఓపెనర్ కుషాల్ పెరీరా (4) ఎల్బీడబ్ల్యుగా వెనుదిరగగా... కౌశల్ సిల్వా (2 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top