ప్రిక్వార్టర్స్లో మన్దీప్
ఆసియా సీనియర్ బాక్సింగ్
బ్యాంకాక్: ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 69 కేజీల విభాగం తొలి రౌండ్లో మన్దీప్ 3-0 తేడాతో వీన్ నాగోక్ హున్ (వియత్నాం)పై విజయం సాధించాడు. క్రితం ఈ ఈవెంట్లో రజతం నెగ్గిన మన్దీప్ పంచ్ల ధాటికి ప్రత్యర్థి గాయపడటంతో బౌట్ను అర్ధంతరంగా ముగించారు. మన్దీప్ సంధించిన రైట్ హుక్ పంచ్కు వీన్ ఎడమ కంటి కింది భాగంలో గాయమైంది. దాంతో రిఫరీ బౌట్ను నిలిపి వేసి మన్దీప్ను విజేతగా ప్రకటించారు.