భారత్కు ‘డ్రా’నందం
ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ
క్వాంటన్ (మలేసియా): తొలి మ్యాచ్లో జపాన్పై భారీ విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్లో మాత్రం ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఆసియా చాంపియన్స ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో భాగంగా దక్షిణ కొరియాతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ను భారత్ 1-1 గోల్స్ వద్ద ‘డ్రా’ చేసుకుంది. పదో నిమిషంలో జియోంగ్ చేసిన గోల్తో కొరియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 33వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ గోల్తో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది. వాస్తవానికి గెలవాల్సిన మ్యాచ్ను భారత్ ‘డ్రా’తో సంతృప్తి పడింది. బంతిని ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకున్నా... గోల్ పోస్ట్లోనికి 12 సార్లు దూసుకెళ్లినా... మూడు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... విజయం దక్కలేదు.
నేడు పాక్తో పోరు...
చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్తో భారత్ ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్లో తలపడనుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్ల సత్తాకు పరీక్షగా నిలువనుంది. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ జట్టులో అంతగా అనుభవంలేని ఆటగాళ్లున్నారు. భారత్ తమ స్థారుుకి తగ్గట్టు ఆడితే పాక్పై గెలవడం కష్టమేమీకాదు.
నేటి సా. గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స-4లో ప్రత్యక్ష ప్రసారం