అశ్విన్కు ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు
ముంబై: భారత అగ్రశ్రేణి ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2017 ఏడాదికి గాను ‘అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెలుచుకున్నాడు. ఇక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో బుధవారం జరిగిన ‘సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్’ వేడుకలో భారత దిగ్గజం సునీల్ గావస్కర్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ గోయెంకా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు.
ఈ సీజన్లో సొంతగడ్డపై భారత్ ఆడిన 13 టెస్టుల్లో 10 టెస్టులు గెలవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. గత 12 నెలల కాలంలో అతను ఏకంగా 99 వికెట్లు పడగొట్టడం విశేషం. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి ఆటోగ్రాఫ్ను సన్నీతోనే తీసుకున్నానని... ఇప్పుడు ఈ అవార్డునూ ఆయన చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉందని అశ్విన్ చెప్పాడు.
సంబంధిత వార్తలు