అద్దంలో ఇద్దరం చూసుకుందాం...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రాడ్నీ హాగ్, భారత స్పిన్నర్ అశ్విన్ల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. దక్షిణాఫ్రికాపై అశ్విన్ మూడు టెస్టుల్లో 24 వికెట్లు తీయడంపై స్పందించిన హాగ్... ‘ అశ్విన్... ఒక్కసారి అద్దంలో చూసుకుని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పిచ్లు స్పిన్నర్లకు అనుకూలించేలా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. దీనికి అశ్విన్ కూడా దీటుగా స్పందించాడు. ‘తప్పకుండా... ఒకే అద్దంలో ఇద్దరం చూసుకుందామా? లేక రెండు అద్దాలు ఆర్డర్ చేయనా?’ అని బదులిచ్చాడు.
సంబంధిత వార్తలు