కుంబ్లేపై అదనపు బాధ్యతలు!

కుంబ్లేపై అదనపు బాధ్యతలు!


ముంబై: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్గా ఎంపికైన మాజీ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే  పలు అదనపు బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్దమవుతున్నాడు. ప్రధాన కోచ్ పదవిలో భాగంగా సహాయక  కోచ్లను కుంబ్లే కోరకపోవడంతో మరికొన్ని బాధ్యతలను అతనే చూడాల్సి వస్తుంది.  వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు బౌలింగ్ విభాగానికి కుంబ్లేనే కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు సంజయ్ బంగర్ను బ్యాటింగ్ కోచింగ్ నియమించిన నేపథ్యంలో మిగతా బాధ్యతలు కుంబ్లేనే మోయనున్నాడు. ప్రధానంగా అటు బౌలింగ్తో పాటు ఇటు ఫీల్డింగ్ విభాగాలకు కుంబ్లే కోచ్గా ఉండనున్నాడు.


 


అంతకుముందు భారత జట్టుకు రవిశాస్త్రి డైరెక్టర్గా పని చేసినప్పుడు బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ తో పాటు మరొక అసిస్టెంట్ను నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినప్పుడు కీలక విభాగాలను చూసే సిబ్బందిని కుంబ్లే  కోరలేదు. దీంతో కుంబ్లేపై అదనపు భారం పడనుంది. ఇదిలా ఉండగా, త్వరలో మిగతా విభాగాలకు కోచ్లను నియమించే అవకాశం ఉంది. విండీస్ పర్యటన తరువాత  టీమిండియా జట్టుకు సహాయక కోచ్ లను నియమించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top