విశ్వనాథన్ ఆనంద్కు మాతృవియోగం
చెన్నై: ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తల్లి సుశీలా విశ్వనాథన్ బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్టు వారు తెలిపారు.
కాగా ఆమెకు భర్త కె.విశ్వనాథన్, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఆనంద్ పెద్ద కొడుకు. తల్లి సుశీల.. ఆనంద్కు తొలి గురువు లాంటివారు. చదరంగంలో తొలి పాఠాలు ఆమె దగ్గరే నేర్చుకున్నారు. ఆనంద్ సాధించిన ప్రతి విజయం వెనుక ఆమె ఉన్నారని చెప్పొచ్చు.
సుశీలా విశ్వనాథన్ మృతిపై ఆల్ ఇండియా ఛెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పిఆర్ వెంకట్రామ రాజా సంతాపం తెలియజేశారు. విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఇంతటి ఘనత సాధించడంలో ఆయన తల్లి పాత్ర చాలా ఉందని ఆయన కొనియాడారు.