ఆరు ఓవర్ల ఆటే...
⇒ రెండో రోజు వర్షం అంతరాయం
⇒ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 289/3
⇒ విండీస్తో రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో శనివారం రోజు మొత్తంలో కేవలం ఆరు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ డు ప్లెసిస్ (230 బంతుల్లో 103; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 94 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసింది.
ఆమ్లా (23 బ్యాటింగ్), డివిలియర్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 270/2 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన డు ప్లెసిస్... టేలర్ తొలి బంతినే బౌండరీకి తరలించి శతకం పూర్తి చేశాడు. కానీ తర్వాతి బంతికే రామ్దిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన డివిలియర్స్, ఆమ్లాతో కలిసి నెమ్మదిగా ఆడాడు. చివరకు ఆరు ఓవర్ల తర్వాత మరోసారి వాతావరణం మేఘావృతం కావడంతో మ్యాచ్ను నిలిపి వేశారు. టేలర్, పీటర్స్, గాబ్రియెల్ తలా ఓ వికెట్ తీశారు.
సంబంధిత వార్తలు