వెస్టిండీస్ పర్యటనలు రద్దు:బీసీసీఐ

వెస్టిండీస్ పర్యటనలు రద్దు:బీసీసీఐ


హైదరాబాద్:వెస్టిండీస్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ దేశ క్రికెటర్లు బోర్డుపై నిరసన వ్యక్తం చేయడంతో విండీస్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది. తాజాగా విండీస్ లో జరిగే టూర్లను బీసీసీఐ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై తీవ్ర తర్జన భర్జనలు పడిన అనంతరం బీసీసీఐ ఎట్టకేలకు విండీస్ టూర్లను రద్దు చేసున్నట్లు స్పష్టం చేసింది. వెస్టిండీస్ తో అన్ని ద్వైపాక్షిక టూర్లను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్ లో పర్యటనను విండీస్ అర్ధాంతరంగా టూర్ రద్దు చేసుకుని స్వదేశానికి పయనం కావడంతో వివాదం చెలరేగింది.



 


వెస్టిండీస్‌ టూర్ లో 3 టెస్ట్‌లు, 5 వన్డేలు, 2 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.  వెస్టిండీస్‌ టూర్‌ రద్దుపై  హైదరాబాద్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్‌ శివలాల్‌ యాదవ్‌ అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది  ఈ టూర్‌ రద్దుతో బీసీసీఐకి భారీ నష్టాలు వాటిల్లాయి. వెస్టిండీస్‌ టూర్‌ రద్దుతో మొత్తం 17 రోజుల లైవ్‌ క్రికెట్‌ రద్దయింది. దీంతో న్యాయపరమైన చర్యలు ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top