క్వార్టర్ ఫైనల్లో జయరామ్

క్వార్టర్ ఫైనల్లో జయరామ్


సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను వరుస సెట్లలో చైనాకు చెందిన హువాంగ్ యుగ్జింగ్‌ను కంగుతినిపించాడు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో జయరామ్ 21-15, 21-18తో గెలిచి... గతేడాది కెనడా ఓపెన్‌లో అతని చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు.

 

  శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కొరియాకు చెందిన లీ హ్యూన్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయి ప్రణీత్ 9-21, 15-21తో ఆరో సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో భారత మేటి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఇదివరకే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top