'అలాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరం'
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరమని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో అతడి శైలి చాలా చక్కగా ఉంటుందని అన్నారు. రాహుల్, కోహ్లి ఇద్దరూ శ్రీలంకతో గ్రూప్'ఎ' మ్యాచ్ గురించి శనివారం చర్చించుకున్నారు.
శ్రీలంకతో సిరీస్ కోసం కోహ్లి.. మాజీ కెప్టెన్ ద్రావిడ్ సలహాలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. ద్రావిడ్ ఆటలో ప్రతి మ్యాచ్ కీలకం.. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటుగా గ్రూప్'ఏ' మ్యాచ్లు కూడా అవసరమని అన్నాడు. టెస్టు సిరీస్లలో ఎక్కువగా స్పిన్ బౌలింగ్ సహకరిస్తుందని తెలిపాడు.
చతేశ్వర్ పుజారా, కోహ్లి శ్రీలంకతో సిరీస్ కోసం సాధన చేస్తున్నారు. ఆస్ట్రేలియా 'ఏ' టూర్ లో రాణించినందుకు పుజారాను ద్రావిడ్ మెచ్చుకున్నారు. ఆరోజు అతడి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడని అన్నాడు. అతడికి ఆటపై చక్కటి అవగాహన ఉందని మిస్టర్ డిపెండబుల్ చెప్పాడు.
సంబంధిత వార్తలు