నెగ్గినా... భారత్కు నిరాశ
అండర్-16 ఏఎఫ్సీ క్వాలిఫయింగ్ టోర్నీ
ఢాకా: ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) అండర్-16 మహిళల ప్రధాన టోర్నమెంట్కు అర్హత సాధించడంలో భారత జట్టు విఫలమైంది. జోర్డాన్ జట్టుతో గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ లీగ్ మ్యాచ్లో భారత్ 6-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అయితే మరో మ్యాచ్లో ఇరాన్ 2-1తో బంగ్లాదేశ్ను ఓడించడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. ఐదు జట్లు ఉన్న గ్రూప్ ‘బి’లో ఇరాన్ అజేయంగా నిలిచి 12 పాయింట్ల తో అగ్రస్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే ఏఎఫ్సీ ప్రధాన టోర్నమెంట్కు అర్హత సాధించి ంది. భారత్ మూడు విజయాలతో తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.