డివిలియర్స్ డకౌట్; కష్టాల్లో దక్షిణాఫ్రికా
నాగపూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఆట రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టింది. స్పిన్నర్ల ధాటికి 12 పరుగులకే దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
11/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ టీమ్ అదే స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఎల్గర్(7) అవుటయ్యాడు. 12 పరుగుల స్కోరు వద్ద ఆమ్లా(1), డివిలియర్స్(0)గా వరుసగా పెవిలియన్ చేరారు. డాషింగ్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్... జడేజా బౌలింగ్ లో డకౌటయ్యాడు.
35 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. డూ ప్లెసిస్(10) అవుటయ్యాడు. 47 పరుగుల వద్ద విలాస్(1) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. 55/7 స్కోరుతో దక్షిణాఫ్రికా ఆట కొనసాగిస్తోంది. డుమిని(25), హార్మర్(7) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 215 పరుగులకు ఆలౌటైంది.