బీసీసీఐ శిక్షణకు 12 మంది క్రికెటర్లు
వీరిలో 8 మంది అమ్మాయిలు
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే జోనల్ అకాడమీ శిక్షణ శిబిరానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నుంచి మొత్తం 12 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. ప్రస్తుత 2014-15 సీజన్కు సంబంధించి త్వరలో మొదలయ్యే ఈ శిబిరంలో అండర్-19 విభాగంలో నలుగురు క్రికెటర్లు, 8 మంది మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నుంచి ఎనిమిది మంది మహిళా క్రికెటర్లు సహా 17 మంది శిబిరంలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ జాబితా: అనిరుధ్, రాహుల్ సింగ్, అంబాది, ప్రణీత్ రెడ్డి; మహిళలు: స్నేహ మోరే, అరుంధతి రెడ్డి, రచన, హిమాని యాదవ్, శ్రావణి, ప్రణీత రెడ్డి, గీతాంజలి, రమ్య (రిజర్వ్)
ఆంధ్ర జాబితా: జయవర్ధనే, క్రాంతి కుమార్, రికీ భుయ్, సూరజ్ ప్రీతమ్, తేజస్వి, కార్తీక్ రామన్, గిరినాథ్, అశ్విన్ హెబ్బర్, కరణ్ షిండే (రిజర్వ్); మహిళలు: మేఘన, ఝాన్సీలక్ష్మి, స్నేహదీప్తి, అనూష, కల్పన, నవ్యదుర్గ, పద్మజ, అంజలి (రిజర్వ్).