నాలుగో దశలో 61% పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల్లో దాదాపు 61 % పోలింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.84 కోట్ల మంది గురువారం ఓటు హక్కు వినియోగించు కున్నారు. 5 గంటలు దాటినా అనేక మంది క్యూలైన్ ఉండ డంతో పోలింగ్ శాతం 63కి చేరుకోవచ్చని యూపీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. భారీగా భద్రతా బలగాల్ని మోహరించడంతో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
మహోబాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీయడంతో ముగ్గురు గాయపడ్డారు. నాలుగోదశలో రాయ్బరేలీ, ప్రతాప్గఢ్, కౌశాంబి, అలహాబాద్, జలౌన్ , ఝాన్సీ. లలిత్పూర్, మహోబా, హమిర్పూర్, చిత్రకూట్, ఫతేపూర్ జిల్లాల్లో ఎన్నికలు జరగ్గా మొత్తం 680 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అన్ని చోట్ల బీఎస్పీ అభ్యర్థుల్ని పోటీకి పెట్టగా, బీజేపీ 48 స్థానాల్లో పోటీ చేసి మిత్రపక్షం అప్నాదళ్కు 5 స్థానాలు కేటాయించింది. ఎస్పీ 30 స్థానాల్లో, కాంగ్రెస్ 25 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాయి.