ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట):
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ నింగిలోని దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.29 గంటలకు నిప్పులు చిమ్ముతూ పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ అంతరిక్షంలోకి పయనమైంది. పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మొత్తం 31 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకుపోయింది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2ఈ ఉపగ్రహంతోపాటు దేశీయ యూనివర్సిటీకి చెందిన ఒక చిన్న ఉపగ్రహం ఉంది. ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు ఉన్నాయి.