100 మంది పోలీసులపై వేటు
లక్నో: రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని యూపీలో కొత్తగా కొలువు దీరిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దాదాపు 100 మంది పోలీసు అధికారులపై వేటువేసింది. వీరంతా ప్రధానంగా ఘజియాబాద్, మీరట్, నోయిడా ప్రాంతాలకు చెందిన వారు. వేటు పడిన వారిలో లక్నోకు చెందిన ఏడుగురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ నవీద్ అహ్మద్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు చేపట్టారు.