పట్టపగలే.. నడిరోడ్డులో.. దుశ్శాసన పర్వం


జమ్ము: జమ్ముకాశ్మీర్లో పట్టపగలే, రోడ్డుపై జనం చూస్తుండగా దుశ్శాసన పర్వం చోటు చేసుకుంది. ఉదంపూర్ జిల్లా జగనూ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఓ యువతిని వివస్రను చేసి చిత్రీకరించారు. నిందితుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా ఉండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం. నిందితుల్లో ఒకడు తన మొబైల్ ఫోన్తో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. వాట్సప్లోనూ ఈ వీడియోను ఉంచారు.



పోలీసులు ఈ ఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఉదంపూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. బాధితురాలు మోటార్ బైక్పై వెళ్తుండగా నిందితులు ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు. ఆమె ప్రతిఘటించడంతో బంధించి వివస్రను చేశారు. జనం ఈ దుశ్చర్యను చూసినా ఎవరూ స్పందించకపోవడం దారుణమైన విషయం. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top