ఈ సారి మా అమ్మాయిలను తీసుకొని వస్తాను:ఒబామా
న్యూఢిల్లీ: ఈ సారి భారత్ సందర్శనకు వచ్చేటప్పుడు మా అమ్మాయిలను తీసుకొని వస్తానని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా చెప్పారు. అయితే తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాకపోవచ్చని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. సోమవారం రికార్డ్ చేసిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసారం చేశారు.
ఒబామా మాటలకు మోదీ స్సందించారు. పదవీ కాలంలో గానీ, ఆ తరువాత గానీ ఎల్లప్పుడు ఒబామాకు భారత్ స్వాగతం పలుకుతుందని చెప్పారు. ఒబామా ఇద్దరు కూతుర్లు మాలియా, సాషా భారత్కు రావాలని అనుకున్నారన్నారు. అయితే రెండు సందర్భాలలో వారికి స్కూల్ ఉండటం వల్ల రాలేకపోయారని తెలిపారు.
తమ ఇద్దరు కుమార్తెలకు భారతదేశమన్నా, భారత స్వాతంత్రోద్యమన్నా, మహాత్మా గాంధీ అన్నా ఆసక్తి అని ఒబామా తెలిపారు.