'మేము లక్ష్యాన్ని చేరుకున్నాం'
ఢిల్లీ: తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిధులతో సంతోషంగా ఉన్నామన్నారు. అయితే ఏపీకి ఎంతిచ్చినా చాలదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీకి ఇప్పటివరకూ కేంద్రం రూ.8,350 కోట్లు కేటాయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.