గవర్నర్గా విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం

విద్యాసాగర్ రావు


ముంబై: మహారాష్ట్ర గవర్నర్గా బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు  ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భన్లో బొంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా  విద్యాసాగర్‌రావు  చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, అతని మంత్రి వర్గ సహచరులు, ఇతర ముఖ్యులు హాజరయ్యారు.



కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఈ నెల 27న  నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే.   మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్‌, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలా, గోవా గవర్నర్‌గా మృదులా సిన్హాలను నియమించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top