బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పు

బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పు


ముంబై : మహారాష్ట్రలో బీఫ్ నిషేధం వివాదం రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది.  బీఫ్ ను తరలిస్తున్న వ్యాన్ కు నిప్పు పెట్టిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు బీఫ్‌ను తరలిస్తుండగా సావ్‌ఖేడా గ్రామం వద్ద కొంత మంది వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు.  ఆ తర్వాత వాహనానికి నిప్పుపెట్టారు. 



ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్‌లో  బీఫ్ తరలిస్తున్న విషయాన్ని  నిర్ధారించారు. సుమారు వంద కేజీల మాంసాన్ని తరలిస్తున్నట్టుగా ఔరంగాబాద్ ఎస్పీ నవీన్ చంద్ర రెడ్డి  తెలిపారు. అయితే   వ్యాన్  పాక్షికంగా తగులబడిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇటూ బీఫ్ రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో అక్రమంగా బీఫ్‌ను తరలిస్తున్న డ్రైవర్‌పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top